Sunday, May 19, 2024

అర్థ‌రాత్రి సైకిల్ పై గ‌స్తీ – ఐపీఎస్ అధికారిణిని కొనియాడిన సీఎం స్టాలిన్

న‌గ‌రంలో రాత్రివేళ ఏం జ‌రుగుతోంది అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు సైకిల్ పై గ‌స్తీ నిర్వ‌హించారు ఐపీఎస్ అధికారిణి ర‌మ్య‌భార‌తి. పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉన్నదీ, లేనిదీ స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు. ఆ సమయంలో రోడ్లపై కనిపించిన అనుమానితులను విచారించారు. చెన్నైలోని ఫ్లవర్ బజార్ నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియో ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి చేరాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. రమ్యభారతికి అభినందనలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement