Monday, April 29, 2024

రూ.50ల‌కే భోజ‌నం – వృద్ధ దంప‌తుల‌కి హ్యాట్సాఫ్

వారికే ఒక‌రు భోజ‌నం పెట్టాల్సిన వ‌య‌సు వారిది. అటువంటిది ఆ వృద్ధ‌దంప‌తులు నలుగురికి భోజ‌నం పెడుతున్నారు..అది కూడా రూ.50ల‌కే. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతన్న వేళ.. హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే అవేమీ లెక్కచేయకుండా వయసు పైబడినా కూడా పట్టించుకోకుండా.. తక్కువ ఖర్చులో రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. స్పూర్తి కలిగించే ఈ వృద్ద దంపతుల వీడియోను @rakshithraiy, @mr.swashbuckler అనే బ్లాగర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నాలుగు రోజుల్లోనే ఈ వీడియోకు 1.6 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. వృద్ద దంపతులు నడుపుతున్న హోటల్ కర్ణాటకలోని మణిపాల్‌లోని రాజ్‌గోపాల్ నగర్ రోడ్డులో ఉంది. 1951 నుంచి వీరు హోటల్‌ను కొనసాగిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉన్న ఆ హోటల్‌‌ను పరిశుభ్రతతో నిర్వహిస్తున్నారు. హోటల్ పేరు గణేష్ ప్రసాద్ కాగా.. స్థానికులు ‘‘అజ్జా అజ్జి మనే’’ అని పిలుస్తారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంట వరకు హోటల్‌ తెరిచి ఉంటుంది. ఈ హోటల్‌లో రూ. 50తో కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఈ హోటల్‌లో అన్నం, రసం, పప్పు, పాయసం, సలాడ్, పెరుగును భోజనంలో భాగంగా అందిస్తారు. సంప్రదాయ పద్దతిలో అరటి ఆకులపై వడ్డిస్తారు. అంతేకాకుండా చిరునవ్వుతో భోజనం అంజేస్తారు. వ్యాపారం కంటే మానవత్వం, ప్రేమ విలువలను పరిచయం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ మారడంతో చాలా మంది నెటిజన్లు ఆ జంటను ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement