Sunday, May 5, 2024

మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా – మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాలు-న‌మ్ర‌త‌

ఆగస్టు 9న మ‌హేశ్ బాబు పుట్టినరోజు ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా మ‌హేశ్ బాబు న‌టించిన పోకిరి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును చిన్న పిల్లల కోసం వినియోగిస్తున్నట్లు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్ తెలిపారు. పోకిరి మూవీ స్పెషల్ ఏర్పాటు చేసిన అభిమానులకు ఆమె థ్యాంక్స్ చెబుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పోకిరి మూవీ స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేశాం. అయితే ఈ ప్రకటన చేసినప్పటి నుంచి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

కొన్ని క్షణాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. పోకిరి మూవీ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబు ఫౌండేషన్‌‌కు అందజేయాలని సూపర్ స్టార్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. ఈ డబ్బును చిల్డ్రన్స్ హార్ట్ ఆపరేషన్స్, చదువుకు వినియోగించనున్నాం. ఈ డబ్బును అందించేందుకు ముందుకు వచ్చిన ఫ్యాన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ధన్యావాదాలు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని నమ్రతా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement