Sunday, May 5, 2024

జూన్ లో కొత్త రేష‌న్ కార్డులు – బ‌ల‌వంతంగా న‌గ‌దు బ‌దిలీ చేయ‌బోం-మంత్రి కారుమూరి

రేష‌న్ కి న‌గ‌దు బ‌దిలీపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హిత‌మ‌న్నారు మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు. . ఈ పథకాన్ని 2017లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని… తాము దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని విమర్శించడమంటే మోడీని విమర్శించినట్టేనని అన్నారు. రాష్ట్రంలో కొంత మంది బియ్యానికి బదులు వేరే ఆహారం తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. గ్రామంలో ఎంత మంది ఇష్టపడితే అంత మందికి మాత్రమే నగదు బదిలీ చేస్తామన్నారు. బలవంతంగా ఎవరికీ నగదు బదిలీ చేయబోమన్నారు. కార్డులు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జూన్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement