Monday, May 20, 2024

Breaking: ఒంగోలు ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

ఒంగోలులో సీఎం కార్యక్రమానికి ఓ కారులో ఉన్న వారిని నడిరోడ్డుపై దించి, వారి కారు తీసుకెళ్లిన ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ సంధ్య, హోంగార్డు తిరుపాల్ రెడ్డిని సస్పెండ్ చేశారు. సీఎం కాన్వాయ్ పేరుతో ప్రయాణీకుల వాహానాన్ని బలవంతంగా తీసుకెళ్లిన ఆర్టీఏ అధికారుల ఘటనపై సీఎంవో ఆరా తీసి .. బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement