Monday, April 29, 2024

Flash: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందగా.. పలువురు తప్పించుకున్నారు. చింతల్ నార్- తిమ్మాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.

సుక్మాలోని తిమ్మాపురం అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కోబ్రా 201 బెటాలియన్ సంయుక్త ఆపరేషన్‌లో ఒక నక్సల్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement