Saturday, April 27, 2024

ప‌ద‌వుల విష‌యం చ‌ర్చించ‌లే.. యూపీ రిజ‌ల్ట్​తో నారాజ్ కాలే: అస‌దుద్దీన్ ఒవైసీ

యూపీ ఫ‌లితాలేమీ త‌నను నిరాశ ప‌ర‌చ‌లేద‌న్నారు ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ. శాస‌నస‌భ స‌మావేశాల సంద‌ర్భంగా ఇవ్వాల (శ‌నివారం) అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్​ను కలిశాన‌ని, ప‌ద‌వుల వంటి మ‌రే ఇత‌ర అంశాలు చ‌ర్చించ‌లేద‌న్నారు. ఇక‌.. యూపీ ఎన్నికల ఫలితాలపై త‌న‌కేం నారాజ్ లేదని, యూపీ ఫలితాలు వేరు, బెంగాల్ ఎన్నికలు వేరని చెప్పుకొచ్చారు.

అయితే.. యూపీ సీఎం యోగీ మాటకారి అని.. ఆదిత్యనాథ్​ తీరుపై కితాబిచ్చారు. ఎన్నికలు అనేవి ఓ గేమ్‌లా మారాయ‌ని, అడుతం.. ఓడుతం అంటూ స‌మాధాన‌మిచ్చారు అసదుద్దీన్​. కాగా, తెలంగాణ‌పై బీజేపీ దృష్టిపెట్టింద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు అంత సీన్ ఉండ‌బోద‌న్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మాంచి జోష్ లో ఉన్నారని, యూపీ రిజల్ట్ ప్రభావం ఇక్క‌డ అస్స‌లు ఉండదన్నారు ఎంఐఎం చీఫ్​ అస‌దుద్దీన్ ఒవైసీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement