Saturday, May 18, 2024

KTR: ధోనీ అత్యుత్తమ ఫినిషర్: మంత్రి కేటీఆర్ ప్రశంస

ఐపీఎల్ లో భాగంగా గ‌త రాత్రి ముంబై జ‌ట్టుపై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో కొత్త ఊపు తీసుకొచ్చాడు.  ధోనీపై సర్వత్ర ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ధోనీ ఛాంపియ‌న్ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్  ట్విట్ట‌ర్‌ వేదికగా స్పందించారు. ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అని, అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రోజు రోజుకీ ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ మ‌రింత ప‌రిణితి చెందుతున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఐపీఎల్‌లో గురువారం ముంబైతో జ‌రిగిన మ్యాచ్ ఫైన‌ల్ ఓవ‌ర్‌లో ధోనీ ఆక‌ట్టుకున్నాడు. ధోనీ ఫ‌టాఫ‌టా షాట్ల‌కు ముంబై జ‌ట్టుకు వ‌రుస‌గా ఏడో ఓట‌మి పాలైంది. తొలుత ముంబై ఏడు వికెట్ల‌కు 155 ర‌న్స్ చేయ‌గా.. 20 ఓవ‌ర్ల‌లో చెన్నై ఆ టార్గెట్‌ను అందుకున్న‌ది. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో.. ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement