Monday, April 29, 2024

ఎంపీ సంతోష్ కుమార్ బ‌ర్త్ డే .. మూడు వేల మొక్క‌లు నాటిన ఎమ్మెల్యే , కార్పొరేట‌ర్స్ ..

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం నేడు. ఈ మేర‌కు ఖిలా వరంగల్ లో ఆయ‌న అభిమానులు కేక్ కట్ చేశారు. అనంత‌రం 3000 మొక్కలు నాటారు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ,కార్పొరేటర్లు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు టిఆర్ ఎస్ నాయ‌కులు, నేత‌లు పాల్గొన్నారు. కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మానికి ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మూడు వేల మొక్క‌లు నాట‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement