Sunday, May 5, 2024

ఏపీ సీఎంఆర్ఎఫ్ కు ప్ర‌భాస్ రూ.కోటి విరాళం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే.. భార ఈర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లొచ్చి.. వాగులు, వంక‌లు పొంగిపొర్లి, చెరువులు కూడా తెగిపోయాయి. అయితే ఆ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వానికి అండ‌గా టాలీవుడ్ స్టార్ హీరోలు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అంద‌జేస్తున్నారు. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమవంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.25 లక్షలు అందించ‌గా.. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయంగా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభాస్ గతంలో కరోనా సమయంలో కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి రూ .4.5 కోట్లు విరాళంగా అందించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement