Thursday, May 9, 2024

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు గురువారం నాడు మరో లేఖ రాశారు. ఏపీ పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీ (పీసీఏ) ఛైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.కనగరాజు నియామకాన్ని రఘురామ తప్పుబట్టారు. చట్టబద్ధమైన పోస్టులో వయస్సు సడలింపుతో నియమించడం తగదని జగన్‌కు హితవు పలికారు. 65 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు వారు మాత్రమే సదరు పదవికి అర్హులన్నారు. జస్టిస్ కనగరాజును నియమించేందుకు ప్రణాళిక ప్రకారమే నిబంధనలు సవరించారన్నారు. 2020 ఏప్రిల్‌లో ఎస్‌ఈసీగా కనగరాజును నియమించారని, నెలలోపే ఆయన నియామక ఆదేశాలను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని రఘురామ లేఖలో గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement