Friday, April 26, 2024

కంగనా మరో ప్రయోగానికి సిద్ధంగా ఉంది !!

అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం తలైవి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు కంగనా. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నారు.

అయితే ఇది బయోపిక్ కాదట. కేవలం ఎమర్జెన్సీ సమయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతుందట. అలాగే ఈ సినిమాను కంగనా తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈరోజు నుండి ఇందిరా గాంధీ పాత్ర కు సంబంధించి ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారట కంగనా. ఇక ముందుగా మేకప్ కోసం ఫేస్ స్కానింగ్స్ మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ పెట్టబోతున్నారట కంగనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement