Monday, May 13, 2024

50 వేల మెజార్టీతో నిన్ను ఓడిస్తా: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్తున్న స‌మ‌యంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘ‌ట‌న‌ల‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డే కార‌ణ‌మ‌ని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. తమను ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. హీన సంస్కృతికి టీఆర్ఎస్ తెర తీసిందని ధ్వ‌జ‌మెత్తారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓడిస్తాన‌ని సవాల్ విసిరారు. జీవ‌న్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాల‌న్నారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఇక రోజులు దగ్గరపడ్డాయని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement