Tuesday, May 7, 2024

కోర్టుకి హాజ‌రుకావాల్సిందే-జాక్వెలిన్ కి నోటీసులు

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ని మ‌నీ లాండ‌రింగ్ కేసు ఇప్ప‌ట్లో వదిలేలా లేదు.. మనీ లాండరింగ్ కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై బాలీవుడ్ న‌టి జాక్వెలిన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఇప్ప‌టికే కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసింది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఢిల్లీ హైకోర్టు నుంచి జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈ నెల 26న త‌మ ముందు హాజ‌రు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్‌పై న‌మోదైన 200 కోట్ల‌ మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్ పేరును చేరుస్తూ ఈడీ గ‌తంలోనే కేసు న‌మోదు చేసింది. సుకేష్ లబ్ధి పోందిన డబ్బు నుంచి ఆమెకు కూడా వాటా వెళ్లిన్నట్టు అనుమానాలు ఉన్నాయి. దాంతో రకరకాల కోణాల్లో ఈ విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement