Wednesday, May 15, 2024

మోడీ, కేసీఆర్ దొందూ దొందే : ష‌ర్మిల

వైఎస్ఆర్ టీపీ అధినేత ష‌ర్మిల ప్రధాని న‌రేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ…. మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని, కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఒక తానులో ముక్కలేనని షర్మిల అభిప్రాయపడ్డారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ జనాలను మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. కానీ మోడీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నాడని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ కూడా ఉద్యోగాలను పీకేస్తూ, నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడని షర్మిల అన్నారు. ఇంటికో ఉద్యగం ఇస్తానన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని.. మోడీ, కేసీఆర్ లు దొందూ దొందే అని ష‌ర్మిల పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement