Wednesday, May 15, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంట‌ర్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో అని, జగన్ రియల్ హీరో అని అన్నారు.పబ్లిక్ గా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని స్పష్టం చేశారు. సభలు పెట్టడం, అనంత‌రం దాని ద్వారా వ‌చ్చిన ప‌బ్లిసిటీతో ప్యాకేజీలు మాట్లాడుకోవడం పవన్ క‌ల్యాణ్‌కు అలవాటే అని ఆయ‌న ఆరోపించారు. ఆయ‌న‌ అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకోకుండా జ‌న‌సేన పోటీ చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. అలా కాకుండా టీడీపీతో  పొత్తు పెట్టుకుంటే పవన్ క‌ల్యాణ్‌కే నష్టమని ఆయ‌న జోస్యం చెప్పారు. జనసేన పార్టీలో కొందరు లక్షల రూపాయ‌లు ఖర్చు చేస్తున్నారని, వారు ఎంత‌గా ఖ‌ర్చుచేసిన‌ప్ప‌టికీ వారిని పవన్ క‌ల్యాణ్ తాకట్టు పెడతార‌ని ఆరోపించారు. పవన్ వ్యక్తిగత దూషణలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని మండిపడ్డారు.
ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

కాగా, నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై విరుచుకుపడ్డారు. అకారణంగా త‌న‌ను పచ్చిబూతులు తిట్టార‌ని, భవిష్యత్తులోనూ ఇలాగే వ్యవహరిస్తే భీమ్లానాయక్ ట్రీట్ మెంట్ అంటే ఏంటో చూపిస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌  వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement