Thursday, May 9, 2024

విశ్వ సుందరి హర్నాజ్ : గౌన్‌ డిజైనర్‌ ట్రాన్స్‌ వుమెన్ అని మీకు తెలుసా

న్యూఢిల్లీ : రెండు దశాబ్దాల ప్రతిష్టాత్మక మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారతీయ అందాల‌భామ మెరిసింది. హర్నాజ్‌ సంధూ విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. 80 దేశాల అందాల తారలు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆమె ధరించిన గౌన్‌పై నెట్టింటిలో చర్చ జరుగుతోంది. అసలు అంతటి అద్భుతమైన గౌన్‌ ఎవరు డిజైన్‌ చేశారంటూ ప్రశ్నల వర్షమే కురుస్తోంది. ఈ పోటీల్లో సంధూ గౌన్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సిల్వర్‌ కలర్‌ లైనింగ్‌తో ఎంతో అందంగా కనిపించేలా ఈ గౌన్‌ను డిజైన్‌ చేసింది ఓ ట్రాన్స్‌ వుమెన్‌. ఆమె పేరు సైషా షిండే. ఈ క్రమంలో మిస్‌ యూనివర్స్‌గా మెరిసిన హర్నాజ్‌తో పాటు సైషా కూడా సంతోషంలో మునిగితేలుతోంది.

అద్భుతంగా హర్నాజ్‌ గౌన్‌..


గౌన్‌పై ఎంబ్రాయిడరీ వర్క్‌, స్టోన్‌ వర్క్‌, సీక్వెన్స్‌లు ఫ్యాషన్‌ ప్రియులను ఎంతో ఆకట్టుకుంది. సైషా అసలు పేరు స్వప్నిల్‌ షిండే. జనవరి నుంచి ఆమె ట్రాన్స్‌ఉమెన్‌గా మారింది. అబ్బాయిగా పుట్టినా.. చిన్నప్పటి నుంచి అమ్మాయిల డ్రెస్‌లు వేసుకోవడం.. అందంగా ముస్తాబవడం అంటే ఇష్టం. ఈ సమయంలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తోంది. ఈ సమయంలోనే తానేంటో ప్రపంచానికి నిరూపించింది సైషా. ఆరేళ్ల క్రితం ట్రాన్స్‌ ఉమెన్‌ నిర్ణయించుకుంది. అప్పటి నుంచి సర్జరీ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ.. ఈ ఏడాది జనవరిలో తన జెండర్‌ను ప్రకటించింది. సైషా వయస్సు 40 ఏళ్లు. పంజాబీ సంప్రదాయం కనిపించేలా.. పుల్కారీ ప్యాటర్న్‌తో ఎంతో ఆకర్షణీయంగా గౌన్‌ను సైషా డిజైన్‌ చేసింది. ఆమె గతంలో ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్‌, దీపికా పదుకునే, తాప్సీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, మాధురి దీక్షిత్‌ లాంటి దిగ్గజ బాలీవుడ్‌ సెలిబ్రెటీలకు కూడా దుస్తువులను డిజైన్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement