Monday, May 6, 2024

రాధా హత్యకు రెక్కీపై మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్య

తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా ? అని మంత్రి ప్రశ్నించారు. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలన్నారు. రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదు హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్ లో రాధా ప్రయాణం చేయకూడదన్నారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని చెప్పారు. భద్రతకి గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అని మండిపడ్డారు. రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారు రాధా తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని విమర్శించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement