చిన్న గ్రామాలకు కూడా అభివృద్ధి కోసం అధిక నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం పోతురెడ్డిపల్లెలో మంత్రి అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామానికి గతంలో సెల్ఫోన్ సిగ్నల్ కూడా లేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం పాఠశాల అదనపు గదులు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేసినట్లు- వివరించారు. గ్రామానికి 5 కోట్ల రూపాయలతో రహదారులు, వైకుంఠదామాలు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. గ్రామం చిన్నదైనా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించినట్లు- మంత్రి తెలిపారు. గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, రోడ్డు, సౌకర్యం, బ్రిడ్జి నిర్మాణాలు, హనుమాన్ దెవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement