Thursday, May 16, 2024

రేపే వుమెన్స్ క్రికెట్ మ్యాచ్ – పాకిస్థాన్ తో ఆడ‌నున్న ఇండియా

ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్ పై 10వ‌న్డేల్లో ఇండియ‌న్ వుమెన్స్ జ‌ట్టు గెలిచిన సంగ‌తి తెలిసిందే. కాగా రేపు ఇండియా..పాకిస్థాన్ మ‌ధ్య వన్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. న్యూజిలాండ్‌లో జ‌రుగుతున్న ఈ టోర్నీలో మౌంట్ మౌంగ‌నూయి ఈ మ్యాచ్‌కు వేదిక కానున్న‌ది. 11 సార్లు జ‌రిగిన టీ20 మ్యాచుల్లో ఒకేసారి ఇండియా ఓడిపోయింది. స్మృతి మందాన ఈ మ్యాచ్‌కు రెఢీగా ఉంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో రేపు జ‌రిగే మ్యాచ్‌లో ఇండియాదే పైచేయి అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మ‌హ‌రూఫ్ ఇటీవ‌లే మెట‌ర్న‌టీ లీవ్ నుంచి వ‌చ్చేసింది. ఆర్నెళ్ల కూతురు ఉన్న ఆమె ఇండియాతో మ్యాచ్‌లో ఆడ‌నున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement