Wednesday, May 1, 2024

కేంద్రమంత్రులకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ లేఖ

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విదార్థులను వేగతంతంగా తరలించాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుకు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రులు జయశంకర్, జ్యోతిరాదిత్య సింధియా, హార్దిప్ సింగ్ పూరిలకు ఎంపీ రామ్మోహన్ లేఖలు రాశారు. రొమేనియా, హంగేరికి అదనపు విమానాలు పంపి విద్యార్థుల తరలింపు వేగవంతం చేయాలని లేఖలో కోరారు. సుమారు 507 మంది విద్యార్థులు రొమేనియా, హంగేరి సరిహద్దులు దాటి విమానాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement