Thursday, May 2, 2024

సాదాసీదాగా ఆస్పత్రికి వెళ్లిన మంత్రి హరీశ్… అవాక్కయిన సిబ్బంది

జనగామ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. నకిరేకల్ నుండి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఉన్న జనగామ ఎంసిహెచ్ కి మంత్రి ఆకస్మికంగా వెళ్లారు. నేరుగా పేషంట్స్ వద్దకు వెళ్లి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీష్ రావు ఆసుపత్రి మొత్తం కలిగియతిరిగారు. ఆసుపత్రిలో పేషంట్స్ తో మంత్రి హరీష్ రావు ఆత్మీయంగా మాట్లాడారు. మంత్రి హరీశ్ రావు సాదా సీదాగా.. సామాన్యునిగా ఆసుపత్రికి రావడంతో ఆస్పత్రి వైద్య సిబ్బంది, పేషంట్స్ అవాక్కైయ్యారు. ఆసుపత్రిలో సౌకర్యాల,  సేవలపై పేషేంట్స్ ను.. వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుకున్నారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నారా, మందులు , అన్నం పెడుతున్నారా లేదా అంటూ ఆరా తీశారు.

కొన్ని లోపాలను గుర్తించిన మంత్రి హరీష్ రావు.. అక్కడి నుండే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకిటి కరుణతో ఫోన్ లో మాట్లాడారు. ఆసుపత్రి సూపరెండేంట్ వెంటనే నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement