Tuesday, May 7, 2024

Big Breaking | పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి.. రాకెట్​ లాంచర్లతో అటాక్!​

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బిజాపూర్​ జిల్లా గంగలూర్​ హీరేలిలో పరస్పరం కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని జిల్లా ఎస్పీ కూడా ధ్రువీకరించారు. పోలీసు క్యాంపుపై రాకెట్​ లాంచర్లతో మావోయిస్టులు దాడులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమై ఫైరింగ్​ ఓపెన్​ చేసినట్టు వార్తలందుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement