Tuesday, April 30, 2024

భర్త సోదరుడితో అక్రమ సంబంధం.. ఉరేసి చంపిన భర్త, ఠాణాలో లొంగుబాటు!

వివాహేతర సంబంధం ప్రాణాలు తీసింది. ఈ ఘటన హైదరాబాద్​లోని గౌలిగూడలో జరిగింది. హైదరాబాద్‌లోని గౌలిగూడ ప్రాంతంలోని ఓ లాడ్జిలో శనివారం రాత్రి తన భార్యను చంపేసి పోలీసులకు లొంగిపోయాడో వ్యక్తి. తన సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను హత్య చేశాడు.

అయితే.. నెల రోజుల క్రితం ఆమె తన భర్త సోదరుడి (బావ) ని చంపడానికి ప్రయత్నించింది.  అప్పటి నుండి పోలీసుల భయంతో, అరెస్టు నుండి తప్పించుకుంటుండడంతో పోలీసులు కూడా ఆ మహిళ కోసం వెతుకుతున్నారు.

తన బావను హత్య చేసేందుకు యత్నించినందుకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు అయ్యింది. అప్పుడే వారి మధ్య ఉన్న ఈ వ్యవహారాన్ని భర్త కనుగొన్నాడు. అప్పటి నుంచి భర్త సాయంతో వేర్వేరు లాడ్జీల్లో ఆ మహిళ తలదాచుకుంది. అయితే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామకృష్ణ అనే నిందితుడు నేరం చేసి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

తన భార్య అరుణను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. లాడ్జికి చేరుకున్న అధికారులు ఆమె మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. రామకృష్ణను విచారించగా శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చీర, కండువాతో తన రెండో భార్య అరుణను గొంతు నులిమి చంపేసినట్టు చెప్పాడు. అతని ప్లాన్ గురించి ఆమెకు ఎలాంటి క్లూ లేదు. అతను ఆమెను మాటల్లో పెట్టి అటాక్​ చేసి చంపేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే, రెండు రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ఎం రవీందర్ రెడ్డి తెలిపారు. ఆమె తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధంలో ఉన్నందున, అతను ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడని రామకృష్ణ పేర్కొన్నాడు. ఇక.. నేరం చేసిన తర్వాత ఏడాది వయసున్న కొడుకుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతనిపై302 సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement