Friday, May 3, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మెండోరా : నిజమాబాద్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. మెండోర మండలం బుస్సాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం యాక్సిడెంట్ జ‌రిగింది. బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనంతో ఇద్దరు అక్కడిక్కడే చ‌నిపోయారు. వాహనాన్ని అక్కడే ఆపకుండా పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement