Thursday, May 2, 2024

వెంటిలేటర్​పై మల్లోజుల మాతృమూర్తి.. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్న డాక్ట‌ర్లు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావుకు జన్మనిచ్చిన మల్లోజుల మధురమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో హైదరాబాదులోని ఓ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్లు వెంటిలేటర్ అమర్చారు. మధురమ్మ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్లు సూచించడంతో వెంటిలెటర్ అమర్చి పెద్దపల్లికి తరలిస్తున్నారు. మల్లోజుల కోటేశ్వరరావు చనిపోయిన‌ప్ప‌టి నుంచి తాను తుదిశ్వాస విడిచే వరకైనా చిన్న కొడుకును చూడాలని ఎన్నోసార్లు తాపత్రయపడారు మ‌ధుర‌మ్మ‌. మధురమ్మ తీవ్ర అస్వస్థతకు గురైందని వార్త పెద్దపల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement