Saturday, April 27, 2024

Breaking: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్ లో మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మ‌హారాష్ట్రకు చెందిన రైతు సంఘం కీల‌క నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తో పాటు పలువురు రైతు నేత‌లు సీఎం కేసీఆర్ స‌మక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ ప్ర‌తినిధులు, ప‌లువురు నేత‌లు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు హైద‌రాబాద్ కు చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ కిసాన్ స‌మితి జాతీయ అధ్య‌క్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్య‌క్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌ల‌వురు నేత‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement