Sunday, May 19, 2024

మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‎ముఖ్‎కు ఊరట

మ‌నీలాండ‌రింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‎ముఖ్‎కు ఊరట లభించింది. దేశ్‎ముఖ్‎ బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

మనీలాండరింగ్ కేసులో దేశ్‎ముఖ్‎కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో దేశ్‎ముఖ్‎కు బెయిల్ లభించినప్పటికీ గత ఏడాది ఏప్రిల్ లో అతడిపై నమోదైన సీబీఐ కేసుకు సంబంధించి ఇంకా కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement