Thursday, May 9, 2024

Maharashtra: ఇల్లు కూలి ఐదుగురు కూలీలు మృతి

నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి ఐదుగురు మృతిచెందగా, మ‌రో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ విషాద ఘ‌ట‌న‌ మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మరణించారు. పూణేలోని ఎరవాడ శాస్త్రి నగర్‌లో ఓ‌ షాపింగ్‌మాల్ కడుతున్నారు. అందులో భాగంగా శ్లాబ్ వేయటం కోసం సెంట్రింగ్ పని చేస్తున్నారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్ధితివిషమంగా ఉందని పూణే డీసీపీ రోహిదాస్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement