Monday, May 6, 2024

ఇద్దరు యువతుల మధ్య లవ్.. పారిపోయి పెండ్లి కూడా చేసుకున్నారు..

ఇద్దరు యువతుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. ఒకరికొకరు మనుసులు ఇచ్చిపుచ్చుకున్నారు. జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లను ఎదురించారు.. పారిపోయి వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్​ రాష్ట్రంలోని చురు జిల్లా రతన్​గఢ్​లో జరిగింది.

హరియాణాలోని జింద్​ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్​గఢ్​లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. ఈ క్రమంలో తన సోదరి ఆడపడుచు(18)తో ఆమెకు ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. కొద్ది రోజులకు వారి స్నేహం ప్రేమగా మారింది. ఒకరికొకరు మనుసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో ఇదేం పని అంటూ వారి నిర్ణయానికి అడ్డుచెప్పారు. ఇద్దరు కలుసుకోకుండా చేశారు.

గత  నవంబర్​ 12న రతన్​గఢ్​​కు చెందిన యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హరియాణాలోని అదంపుర్​ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఫతేబాద్​కు చేరుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జింద్​లో రెండు నెలలుగా కాపురం ఉంటున్నారు. నవంబర్​ 14న ​ యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించటం లేదని రతన్​గఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. కాగా, నిన్న ఆ ఇద్దరు యువతులను పోలీసులు గుర్తించారు. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కుటుంబసభ్యులు, పోలీసులు, అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువతులు తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని భీష్మించుక్కూర్చున్నారు. కలిసే ఉంటామని తెగేసి చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక ‘‘మీ ఇష్టమైన జీవితాన్నే గడపండి’’ అని అక్కడి నుంచి పంపించారు పోలీసులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement