Wednesday, April 24, 2024

నేపాల్ లో పుష్ప హ‌వా – థియేట‌ర్ల వ‌ద్ద హౌస్ ఫుల్ బోర్డులు

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న హీరో హీరోయిన్ గా న‌టించారు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెం సాంగ్ లో మెరిసింది. ఇక ప‌లు ముఖ్య పాత్ర‌ల్లో సునీల్, అన‌సూయ న‌టించారు. కాగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో సైతం హిందీ చిత్రాలతో పోటీ పడి భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు వస్తుండటంతో ఇంకా హిందీ వర్షన్ ను ఓటీటీలో విడుదల చేయలేదు. మరోవైపు నేపాల్ లో సైతం ‘పుష్ప’ సినిమా దుమ్ము రేపుతోంది. నేపాల్ లో హిందీ వర్షన్ సినిమా విడుదలైంది. అక్కడ విడుదలైన అన్ని థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల వద్ద జనం కిక్కిరిసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement