Saturday, April 27, 2024

అవకతవకలు పాల్పడిన సిబ్బంది పై క్రిమినల్ కేసు నమోదు : కలెక్టర్

ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.
జిల్లాలో ఈ సీజన్ వానాకాలం వరి ధాన్యం సేకరణ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగిందని, సీజన్ పూర్తయిన వెంటనే 285 సెంటర్లకు సంబంధించిన రికార్డులు, ట్రక్కు చీట్స్ కలెక్టరేట్ కు తెప్పించి పరిశీలన చేపట్టడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం 25.12.2021 నాటికి జిల్లాలో పూర్తి చేశామని సంబంధిత రికార్డుల పరిశీలన వారం రోజుల పాటు డీఆర్డీఏ, పీఏసీఎస్, పౌర సరఫరాల అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ రికార్డుల పరిశీలనలో భాగంగా రెండు పీపీసీల‌కు సంబంధించి రికార్డ్ ల యందు వ్యత్యాసం కనుగొనుట జరిగిందని, తద్వారా ఈ వ్యత్యాసానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే అవకతవకలకు పాల్పడిన సిబ్బంది పై తేదీ 5.1.2021, 7.1.2022 తేదీల్లో శాఖా పరమైన చర్యలతో పాటు బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన సొమ్మును రికవరీ చర్యలు ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి ఆదేశానుసారం సంబంధిత వ్యక్తులపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ధాన్యం అవకతవకలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుందని కలెక్టర్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement