Friday, April 26, 2024

ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు వెలకట్టలేనివి : మమత

ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులకు బూస్టర్ డోస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా గత కొన్ని రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని, కచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement