Saturday, May 4, 2024

Viral: ‘కచోరీ’ కోసం రైలును ఆపిన ట్రైన్ డ్రైవర్

పాకిస్తాన్‌లో ఓ లోకో పైలట్ పెరుగు కోసం ఏకంగా రైలునే ఆపిన ఘటన తెలిసిందే. తాజాగా మన దేశంలోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ లోకో పైలట్ కచోరీ కోసం ఏకంగా రైలునే ఆపాడు. కచోరీ కోసం అతను ట్రైన్‌ని నిలిపేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్తాన్‌ అల్వార్‌లోని దౌడ్‌పూర్‌లో ఉండే ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఆ లోకో పైలట్ రైలును ఆపాడు. అప్పటికే అక్కడ కచోరీ పార్శిల్‌తో ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. కచోరీ కోసమే రైలును ఆపిన ఆ లోకో పైలట్.. పార్శిల్ అందుకోగానే ట్రైన్‌ని మళ్లీ స్టార్ట్ చేశాడు.  వీడియోలో రైలు ట్రాక్‌ దగ్గర ప్రమాదకరంగా వేచి ఉన్న వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి భద్రత గురించి కొందరు ఆందోళన చెందుతున్నప్పటికీ, రైలు ఆగిన తర్వాత లోకో పైలెట్ కి అతను ఒక ప్యాకేజీని అందజేయడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement