Sunday, May 5, 2024

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. లైన్‌మెన్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు 31.01.2021 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి అదే విధంగా 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు జిల్లాల పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు, ఇతర ముఖ్యమైన విషయాలు:
✪ ఈ పోస్టుల‌కు దర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఐ.టి.ఐ ఎలక్ట్రికల్ లేదా వైర్ మెన్ సర్టిఫికెటర్ లేదా, ఇంటర్ ఓకేషల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అర్హత పొంది ఉండాలి
✪ అర్హత, ఆస‌క్తి క‌లిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
✪ ద‌ర‌ఖాస్తుల‌కు 07-04-2021 ప్రారంభ తేదీ
✪ చివ‌రి తేదీ 03-05-2021
✪ ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఎస్సీ/ఎ‌స్టీలు రూ. 350 చెల్లించాల్సి ఉంటుంది.
ఓసీ/బీసీలు రూ. 700 చెల్లించాలి
✪ ప‌రీక్ష తేదీ 23-05-2021
✪ ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు రూ. 15000 జీతంగా అందిస్తారు
✪ అభ్యర్థులు పూర్తి వివరాలకు https://apcpdcl.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement