Friday, April 26, 2024

ధోనీ ఇక చాలు, రెస్ట్ తీసుకో: బ్రియాన్ లారా

మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ లో ఈ పేరు ఓ సంచలనం. ధోని కి ఉన్న ఫ్యాన్ బలం అంతా ఇంతా కాదు. టీమిండియా నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి ఐపీఎల్లో ధోనీ క్రేజ్ ఏ మత్రం తగ్గలేదు. ధోని ఎప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన ప్రతిసారి అభిమానులు ఓ ధనాధన్ ఇన్నింగ్స్ ని ఆశిస్తుంటారు. అయితే గత సీజన్లోనూ, ఈ సీజన్లోనూ ఎంఎస్ ధోని ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పుడు ఇదే అంశాన్ని విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రస్తావించాడు. ధోనీ కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నా, బ్యాట్స్‌మెన్‌గా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటిల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో రెండో బంతికే డకౌట్ అయిన ధోనీ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయాడని అన్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటుతో రాణించకపోయినా సీఎస్‌కే మంచి విజయాలు సాధించింది, సాధిస్తోంది. కాబట్టి మాహీ రెస్టు తీసుకుంటే బెటర్. కావాల్సినంత బ్రేక్ తీసుకుని, బరిలో దిగితే అతనికి, ఫ్యాన్స్‌కి కావాల్సిన ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది…ఈ జట్టు ఇలాగే రాణిస్తే, ఐపీఎల్ టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ధోనీ రెస్టు తీసుకున్నా… ప్లేయర్లను ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు….అంటూ కామెంట్ చేశాడు విండీస్ మాజీ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా.

Advertisement

తాజా వార్తలు

Advertisement