Sunday, April 28, 2024

బొప్పాపూర్‌లో కరోనా వ్యాక్సీనేషన్..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌ ఆరోగ్య ఉప కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతతో ప్రజలు కరోనా బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా బారినుండి రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిషీడ్‌ , కోవాక్షిన్‌ వ్యాక్సిన్‌లను అందుబాటు- లోకి తెచ్చాయి. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించిన వ్యాక్సిన్‌ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 45, 60 ఏళ్లకు పైన బడిన వందలాది మందికి వ్యాక్సిన్‌ను వైద్యాధికారులు వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రద్దీ తీవ్రంగా మారడంతో గొల్లపల్లి, వీర్నపల్లి, దేవుని గుట్ట తండా, అల్మాష్‌పూర్‌, రంగంపేట, దుమాల, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్‌లలో వ్యాక్సిన్‌ తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement