తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులొచ్చాయి. చాలా జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. పలు చోట్ల వర్షం కూడా కురుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. ఒక్కసారే పెద్దపెట్టున ఉరుములు, మెరుపులు రావడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోయారు. కాగా, ఖమ్మంలోని ఓ రెస్టారెంటుమీద పిడుగుపడింది. దీంతో మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయ్యిందని చాలా మంది అనుకుంటున్నారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో ఈదురుగాలలకు అరటి తోటలు ధ్వంసం అయ్యియి. దాదాపు 250 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.