Friday, May 3, 2024

దుమ్ము రేపుతోన్న లైగ‌ర్- విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు అద‌ర‌గొడుతోన్న ర‌మ్య‌కృష్ణ‌

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం లైగ‌ర్.ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. పూరి జగన్నాథ్, నటి..నిర్మాత చార్మి,బాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు..అయితే ఈ లైగర్ సినిమా తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ గా కనిపించాడు. విజయ్ దేవరకొండ తో పాటు రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. టీజర్ ను మించిపోయి ఈ ట్రైలర్ ఉంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఈ ట్రైల‌ర్ ని మెగాస్టార్ చిరంజీవి..యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement