Friday, May 17, 2024

కడెం, శ్రీ‌శైలం ప్రాజెక్టుల‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి ప్రాజెక్టులోకి 59,403 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జలాశయం 16 గేట్ల ద్వారా 37,823 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ఇప్పుడు 682.650 అడుగులు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2,22,935 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 879 అడుగుల వద్ద ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182.9910 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement