Sunday, May 5, 2024

FLASH: జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల వేట.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. శనివారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌, కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని సిర్హమా ప్రాంతంలో, కుల్గామ్‌లోని చకీ సమాద్‌, డీహెచ్‌ పొరా ప్రాంతాల్లో ముష్కరులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. కాగా, అనంత్‌నాగ్‌లో హతమైన ఉగ్రవాది లష్కరే తొయిబాకు చెందినవాడు కాగా.. కుల్గామ్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement