Thursday, April 25, 2024

India Corona: దేశంలో కొత్తగా 1150 కేసులు.. 83 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గింది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1150 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,34,217 కు చేరింది. ఇందులో 4,25,01,196 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1194 మంది కరోనా నుంచి కోలు కున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కొవిడ్ తో 83 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,21,656 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,85,55,07,496 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement