Thursday, April 25, 2024

KTR: జేపీ నడ్డా అంటే.. అబద్దాల అడ్డా.. మోదీ రైతు విరోధి

ఉద్యమ నేత కేసీఆర్ మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. జేపీ నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి, చదువుకున్న, జ్ఞానం ఉన్నోడు అనుకున్నాం కానీ.. బండి సంజయ్, నడ్డాకు తేడా లేదని విమర్శించారు. జేపీ నడ్డా అంటే.. అబద్దాల అడ్డా అని, నడ్డాను ఎర్రగడ్డాకు పంపించాలని మండిపడ్డారు. బీజేపీ అంటే బక్వస్ జుమ్లా పార్టీ అని దుయ్యబట్టారు. దేశంలోనే మొదటిసారి ప్రధానిని రైతులు వెనక్కి పంపించారని, రైతులు ప్రధానిని అడ్డుకున్నారంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని అన్నారు.

దేశానికి బీజేపీ చేసిందేం లేదు గానీ చిల్లర రాజకీయాలు చేస్తూ హిందూ, ముస్లింల మధ్య గొడవ పెడుతోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుకోవడానికి అరపైసా పనిచేయని దిక్కుమాలిన ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ రైతు విరోధి అని మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యం గురించి దెయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. నిన్న రైతులను రెచ్చగొట్టి.. నేడు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement