Friday, April 26, 2024

Crime: తండ్రి చేతిలో కొడుకు హతం

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకును కన్న తండ్రే హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగూడూర్ లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేడం శంకరయ్య తన కుమారుడు మేడం రాజ్ కుమార్ ను కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్ ప్రతిరోజు మద్యం సేవించి తండ్రితో పాటు కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతూ ఉండేవాడని, మద్యం మత్తులో మరోసారి  రెచ్చిపోయిన రాజ్ కుమార్ ను తండ్రి శంకరయ్య కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత నగర్ ఎస్సై మహేందర్ లు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ ప్రదీప్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement