నటి ఖుష్భు మరోసారి బుల్లితెరపై సందడి చేయనుంది. ఖుష్భూ ప్రధాన పాత్రలో నటించిన మీరా సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది. ఈ సీరియల్లో ఖుష్భూ కేవలం మెయిర్ రోల్ మాత్రమే కాకుండా.. స్క్రీన్ రైటర్గానూ పనిచేస్తుంది. ఈ సీరియల్ మార్చి 28 నుంచి ప్రసారం కానుంది. భార్యభర్తల మధ్య ఉన్న చేదు, తీపి సంబంధాన్ని ఇందులో తెలియజేయనున్నారు. అలాగే.. కొన్ని కారణాలతో వారిద్దరు విడిపోవడం.. ఆ తర్వాత వారిద్దరు ఎలా కలుసుకుంటారు అనే విషయాలతో సీరియల్ ఉండనుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కృష్ణ, సురేష్ మీనన్ భార్య మీరా పాత్రలో ఖుష్బూ నటించింది. పిల్లల ముందే భార్య పై చేయి చేసుకోవడం.. వంటి అంశాలను ఇందులో చూపించారు. అయితే ఇటీవల ఈ విషయంపై కలర్స్ తమిళ్ ఛానల్ మిస్డ్ కాల్ ప్రచారాన్ని నిర్వహించింది. భర్త తన భార్యను కొట్టడాన్ని మీరు సమర్థిస్తారా ? లేదా ? అంటూ టోల్ ఫ్రీ నంబర్ షేర్ చేసింది. భర్త భార్యపై చేయి చేసుకోవడం సమర్థిస్తున్నారా ? స్టాండప్ విత్ మీరా అంటూ ప్రజల్లోకి సీరియల్ గురించి ప్రచారాన్ని చేరవేసింది. మహిళలు గృహ హింసకు గురికావడానికి వ్యతిరేకంగా ఖుష్బూ పోరాటం చేస్తుంది. అన్ని వర్గాల మహిళలు.. బాగా చదువుకున్న వారు.. పట్టణాల్లో.. గ్రామాల్లో ఉండేవారు గృహహింసను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ప్రేక్షకులకు తెలియజేయడమే మీరా సీరియల్ లక్ష్యం అని నిర్వాహకులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement