Friday, May 3, 2024

వ‌రంగ‌ల్ : చెరువులో ప‌డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు చెరువులో ప‌డి మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ప‌రామ‌ర్శించి కన్నీరు పెట్టుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలు మృతి చెందంతో గ్రామస్తులంద‌రూ కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మూడు తరాలకు చెందిన తాత క్రిష్ణమూర్తి, కొడుకు నాగరాజు, మనువడు లక్కీ మృతిచెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అకాలంగా మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement