Tuesday, May 7, 2024

కామారెడ్డి అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ పోటీ….. రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్…

కామారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. ఆదివారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అనంతరం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆయనను కామారెడ్డి నుండి పోటీ చేయాలని తాను స్వయంగా కోరడం జరిగిందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ తరహాలలో కామారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి జరగనున్నట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని తెలిపారు. కులవృత్తుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. బిక్కనూరు పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు మండల కేంద్రంలో గల పురాతన సిద్ధి రామేశ్వర ఆలయాన్ని రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి ,జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, పట్టణ సర్పంచి వేణు, సొసైటీ అధ్యక్షులు భూమయ్య, ఉపసర్పంచ్ నరేష్, ఎంపీటీసీ సభ్యులు చంద్రకళ రాములు ,సువర్ణ ప్రభాకర్, బాబు, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం ,సిద్ధి రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి ,పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement