Tuesday, May 7, 2024

Twitter | కరీంనగర్​కు ప్రకృతి శోభ.. ఎంతో వైభవం రాబోతోంది: మంత్రి కేటీఆర్​

మంత్రి గంగుల కమలాకర్​ని పొగడ్తలతో ముంచెత్తారు బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీ రామారావు.​ ఆయన మార్గదర్శకత్వంలో కరీంనగర్​లో మౌలిక సదుపాయాలు చక్కగా రూపుదిద్దుకుంటున్నాయని ఇవ్వాల (మంగళవారం) ట్విట్టర్​లో పేర్కొన్నారు.

కరీంనగర్ సిటీకి ఆనుకుని ఉన్న మానేరు నదిపై 500 మీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జిని రేపు (బుధవారం) ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ కేబుల్ బ్రిడ్జ్.. రాబోయే మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్​కు అందమైన ప్రకృతి దృశ్యాన్ని.. కొత్త వైభవాన్ని తీసుకురాబోతున్నాయని తెలియజేస్తూ.. ట్విట్టర్​లో కొన్ని ఫొటోలను షేర్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement