Tuesday, May 14, 2024

ఎంబీబీఎస్ సీట్లభర్తీకి నోటిఫికేషన్.. నేడు, రేపు వెబ్ ఆప్షన్లు..        

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యంబీబీఎస్, పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఏప్రిల్ 1,2 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం మాప్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. ఖాళీ ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీ వివరాలు వెబ్ సైట్ లో పెట్టినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఎంబీబీఎస్ కు సంబంధించి ఈ రోజు(ఏప్రిల్ 1) సాయంత్రం 6 గంటల నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్ కు అర్హులుగా పేర్కొంది.

గత విడత కౌన్సెలింగ్ లో సీటుఅలాట్ అయి జాయిన్ కాకపోయిన చేరి డిస్ కంటిన్యూ చేసినా.. ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన ఈ కౌన్సెలింగ్ కు అనర్హులని తెలిపింది. పీజీ యాజమాన్య కోటాకు సంబంధించి తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 1వ తేది ఉదయం 6 గంటల నుండి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement