Tuesday, May 7, 2024

జ‌య‌ల‌లిత మృతిపై ఈనెల 5న మ‌ళ్లీ విచార‌ణ

త‌మిళ‌నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ మ‌ళ్లీ ఈనెల 5వ తేదీన‌ విచారణ ప్రారంభించనుంది. అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తరపు న్యాయవాది సాక్షుల వద్ద జరిపిన విచారణ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు సంబంధించి ఆర్ముగస్వామి కమిటీ తదుపరి చర్యలు చేపట్టే నిమిత్తం అధికారులతో చర్చలు జరిపారు. అపోలో వైద్యులను మళ్ళీ విచారించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ఏప్రిల్‌ ఐదున అపోలో ఆస్పత్రి డాక్టర్లను కమిటీ విచారించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement